AMARAVATHI

టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. పోటు కార్మికులకు వేతనాలు రూ.10వేలు పెంచాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. శ్రీవారి ఆలయ పెద్ద జీయర్, చిన్న జీయర్ మఠాలకు ప్రతియేటా ఇచ్చే ప్యాకేజీ మరో కోటి రూపాయలకు పెంపు చేశారు. వాహనం బేరర్లు, ఉగ్రాణం కార్మికులు, స్కిల్ లేబర్ గా గుర్తించి తగిన విధంగా వేతనాలు పెంచాలని నిర్ణయించారు. ఫిబ్రవరిలో రెండు రోజులుపాటు దేశవ్యాప్తంగా పీఠాధిపతులను ఆహ్వానించి సదస్సు నిర్వహించాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. టీటీడీ ఉద్యోగులకు ఈనెల 28న 3,518 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని, అదేవిధంగా జనవరిలో మరో 1500 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. రిటైర్డ్ ఉద్యోగులు తదితరులకోసం మరో 350 ఎకరాలు 85 కోట్లతో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాలని తీర్మానించారు. శానిటేషన్ ఉద్యోగులు వర్క్ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు పెంచాలని, కళ్యాణ కట్టలో పీస్ రేట్ బార్బర్ల వేతనాలు కనీసం 20,000 ఇవ్వాలని పాలకమండలి సమావేశంలో నిర్ణయించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *