కళాక్షేత్ర ఫౌండేషన్ లో విద్యార్థినిలను లైంగిక వేధిస్తూన్న ప్రొఫెసర్ కు జైలు శిక్ష
అమరావతి: చైన్నై సాంప్రదాయ కళను బోధించే ప్రతిష్టాత్మక ‘కళాక్షేత్ర ఫౌండేషన్’లో పనిచేస్తున్న ప్రొఫెసర్ హరి పద్మన్,, విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువు కావడంతో మంగళవారం సైదాపేటలోని మెజిస్ట్రేట్ కోర్టు అతన్ని దోషిగా గుర్తించి IPC సెక్షన్ 509, 354(A), సెక్షన్ 4, హరాస్మెంట్ ఆఫ్ విమన్ ప్రివెన్షన్ యాక్ట్ కింద శిక్ష విధించడంతో,,చెన్నై పోలీసులు అతన్ని జైలుకు తరలించారు..లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురు ఫ్యాకల్టీ సభ్యులను నిర్దోషులుగా తేలేవరకు, వాళ్లను రిమాండ్ లోనే ఉంచాలని తమిళనాడు మహిళా కమిషన్ పోలీసులను డిమాండ్ చేసింది..ప్రొఫెసర్ హరి పద్మన్,,తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని దాదాపు 200 మందికి పైగా మహిళ విద్యార్దినిలు ఆందోళన చేశారు..తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, బాడీ షేమింగ్ చేస్తున్నారని, తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..విద్యార్థినిలు గతంలో ప్రొఫెసర్ పై ఫిర్యాదు చేసినా కాలేజీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు..ఈ నేపథ్యంలో సుమారు 90 మంది విద్యార్థినిలు, రాష్ట్ర మహిళా కమిషన్ శుక్రవారం ఫిర్యదును అందజేశారు..ఈ ఫిర్యాదులు అందుకున్న పోలీసులు శనివారం ప్రొఫెసర్ ని అదుపులోకి తీసుకున్నారు.