నగర పాలక సంస్థ అధికారులతో సి & డి.ఎమ్.ఎ. ప్రవీణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్
నెల్లూరు: నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్, అన్ని విభాగాల ఉన్నతాధికారులతో కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రవీణ్ కుమార్(IAS) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు..నగర పాలక సంస్థలోని కమాండ్ కంట్రోల్ విభాగంలో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. జగనన్న శాశ్వత భూహక్కు పధకం ద్వారా రీ సర్వే విధానం, రోడ్ల రిపేర్లు, జగనన్నకాలనీల్లో గృహాల నిర్మాణం, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు, క్లాప్ కార్యక్రమం వంటి వివిధ అంశాల పురోగతిని చర్చించారు. నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ విభాగంలో కమిషనర్ శ్రీమతి హరిత, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, ఇతర విభాగాల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో అడ్మిన్, వార్డు ప్లానింగ్, శానిటేషన్ వార్డు కార్యదర్శులు హాజరయ్యారు.