24 గంటల్లోనే వైసీపీ కండువా కప్పుకున్న కేతంరెడ్డి.వినోద్ రెడ్డి
నెల్లూరు: జనసేన పార్టీలో తాను ఎంతో కష్టపడ్డానని,,అయితే జిల్లా జనసేన నాయకులు తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదంటే జనసేన నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్ది కేతంరెడ్డి వినోద్ రెడ్డి జనసేనకు రాజీనామా చేసిన 24 గంటల్లోనే వైసీపీలో చేరారు..శుక్రవారం ఆయనకు ఎంపీ విజయసాయి రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. పంటి బిగువున భరించానని ఇక ఇలాంటి అవమానాలు భరించలేనంటూ సన్నాయి నొక్కులు నొక్కిన వినోద్ రెడ్డి,,పార్టీ మారడంలో జనసైనికులకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదని పార్టీ నేతలు వ్యాఖ్యనిస్తున్నారు..అయన స్థాయి కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా, జనసేనపార్టీ ఎమ్మేల్యే అభ్యర్దిగా పోటీ చేసేందుకు వేదిక ఇచ్చిందంటూ గుర్తు చేశారు..