విలక్షణ నటుడు శరత్ బాబు కన్నుమూత
హైదరాబాద్: తెలుగు చలన చిత్ర రంగంలో విలక్షణ కథానాయకుడు,,విశిష్ట నటుడు అయిన శరత్ బాబు(71), AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యహ్నం 1.30 గంటలకు కన్నుమూశారు..ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతూ ఆయన లేని లోటు సినీపరిశ్రమకు, అభిమానులు ఎప్పుడూ తీరదని పేర్కొన్నారు..శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు..1951 జూలై 31న శ్రీకాకుళం అముదాలవలసలో జన్మించారు..సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పేరు మార్చుకున్నారు..తెలుగు,తమిళ,కన్నడ,మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 250 కు పైగా చిత్రాల్లో నటించారు..1973లో నటుడిగా జీవితం ప్రారంభించిన శరత్ బాబు సపోర్టింగ్ యాక్టర్ గా పలు సార్లు నంది అవార్డులు అందుకున్నారు..శరత్ బాబు 1974లో నటి రమాప్రభ వివాహం చేసుకున్నారు..కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 1988లో ఆమెతో విడిపోయారు..మళ్లీ 1990లో స్నేహనంబియార్ ను రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమెతో కూడా కొన్ని సమస్యలు ఎదురు కావడంతో 2011లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు.