ఎమ్మెల్యే కోటా MLC ఎన్నికల్లోనూ విజయం సాధించిన టీడీపీ అభ్యర్ది
అమరావతి: ఎమ్మెల్యే కోటా MLC ఎన్నికల్లోనూ టీడీపీ విజయాన్ని నమోదు చేసింది..ఏడుగురు అభ్యర్థులు గెలిచేందుకు అవసరమైన ఎమ్మెల్యేల బలం వైసీపీకి ఉన్నప్పటికీ,,టీడీపీ అభ్యర్థి గెలవడంతో వైసీపీ శ్రేణులు షాక్ కి గురయ్యాయి..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని అనూహ్య ఫలితం వచ్చాయి..టీడీపీ తరపున బరిలోకి దిగిన పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు రావడంతో ఆమె MLCగా విజయం సాధించారు..వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టంమౌతొంది..పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా 3 స్థానాల్లో విజయం సాధించి అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. అది మరువకముందే అధికారపార్టీకి మరోసారి రాజకీయ కుదుపు తాకినట్లు అయ్యింది..రాబోయే రోజుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశలు కన్పిస్తున్నాయి..