ధైర్యంగా పోరాడే వ్యక్తి నారాయణ,వైసీపీ నేతలకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది-బాబు
నెల్లూరు: నెమ్మదస్తుడైన అయిన నారాయణ లాంటి వ్యక్తిని వైసీపీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో ప్రజలందరికి తెలుసు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు..శనివారం నగరంలోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్ లో వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు టీడీపీలో చేరిక సందర్భంగా పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు..ఈ సందర్బంలో మాజీ మంత్రి, నెల్లూరు నగర సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ గురించి చంద్రబాబునాయుడు ప్రస్తవిస్తూ వైసీపీ నాయకుల వేధింపులకు నారాయణ బెదిరిపోలేదన్నారు..అయన ఏ తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా నిలబడ్డారన్నారు..నిరంతరం ప్రజాసంక్షేమం, నెల్లూరు అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళుతున్నారని ప్రశంసించారు..రానున్న ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి నారాయణను గెలిపించుకుని,బెదిరించిన వారందరికీ తగిన బుద్ధి చెప్పాలని కోరారు.