ఒకే వేదికపై నరేంద్ర మోదీ, శరద్ పవార్-లోకమాన్య తిలక్ అవార్డు అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో,,విపక్ష కూటమి (INDIA)లోని ముఖ్యనేత శరద్ పవార్ వేదికను పంచుకున్నారు.. The tilak smarak mandir trust (హింద్ స్వరాజ్ సంఘ్) అనే సంస్థ ప్రకటించిన లోక్మాన్య తిలక్ నేషనల్ అవార్డును మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందుకున్నారు..తొలుత లోకమాన్య తిలక్ కు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు.. NCP అధినేత శరద్ పవార్,,ప్రధానమంత్రి నరేంద్రమోడీతో వేదికను పంచుకోవడంపై రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది..మహారాష్ట్ర పూణేలో జరిగిన కార్యక్రమం వేదికైంది..ఈ కార్యక్రమానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు..వీరితో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ షిండే,,కాంగ్రెస్,,శివసేన నేతలు పాల్గొన్నారు..
(INDIA) విపక్షాల కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్నశరద్ పవర్,, ప్రధాని మోదీకి అవార్డు ప్రధానం చేసే కార్యక్రమంలో శరద్ పవార్ పాల్గొనకుండా ఉండేందుకు కాంగ్రెస్, మహారాష్ట్రలోని ఇతర ప్రతిపక్ష పార్టీలు సోమవారం ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించాయని సమాచారం..మోదీతో వేదిక పంచుకోవడంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తుందని మొత్తుకున్నాయి..అయితే పవర్ వీరి మాటలను బేఖాతరు చేస్తు,, మోడీ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు..
కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ, పింప్రీ చించ్ వాడ-పూణేలను కలుపుతూ కొత్త మెట్రో రైలు మార్గాన్ని పొడిగించడం, వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థానలు చేశారు.