AMARAVATHINATIONALPOLITICS

ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ-ఎన్నికల సంఘం నోటీసులు

అమరావతి: నోటికి ఏది వస్తే అది మాట్లాడడం,,కోర్టుల నుంచి నోటీసులు వస్తే,,క్షమాపణలు చెప్పడం కాంగ్రెస్ పార్టీ యువరాజుకు షారా మామలు అయిపోయింది..మోదీ దురదృష్టం వల్లే ఇండియా ఓడిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఆగ్రమం వ్యక్తం చేస్తూ,ఈ విషయమై రాహుల్ గాంధీకి నోలీసులు పంపింది..నవంబర్ 25వ తేది లోగా సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది..”మోదీని పనౌతి (చెడు శకునం), పిక్ పాకెట్ “ అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు..రాహుల్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లవెత్తాయి.. ప్రపంచకప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టు చేతిలో భారత జట్టు ఓడింది..ఈ ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు..మ్యాచ్ ను వీక్షించేందుకు ప్రధానిమోదీ స్టేడియానికి రావడం వల్లే జట్టు ఓటమి పాలైందంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..ఇండియా దాదాపు ప్రపంచకప్ ను గెలుచుకుందని, కాకపోతే ఓ చెడు శకునం వారిని ఓడిపోయేలా చేసిందని ప్రదానిమోదీని ఉద్దేశిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు..రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం జాలోర్ లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *