AMARAVATHIEDUCATION JOBSHYDERABAD

సుజనా చౌదరికి చెందిన మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు ?

హైదరాబాద్: మాజీ ఎం.పి సుజనా చౌదరి చెందిన మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపును నేషనల్ కౌన్సిల్ రద్దు చేసింది..2023-24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ నిలిపివేస్తున్నట్లు మంగవారం ఉత్తర్వులు విడుదల చేసింది.తెలంగాణలో హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి ఘన్ పూర్ లో మెడిసిటీ ఇన్ స్టిట్యూల్ ఆప్ మెడికల్ సైన్సెస్ పేరుతో 2002 సంవత్సరంలో ఈ కాలేజ్ ని సుజనా చౌదరి ఏర్పాటు చేశారు..2012-13 విద్యా సంవత్సరం నుంచి ఈ కాలేజ్ లో 100 సీట్లకు మెడికల్ ఆడ్మిషన్లకు మెడికల్ కౌన్సిల్ ఆప్ ఇండియా అనుమతించింది..2017లో సీట్ల సంఖ్య 150కి పెరిగింది..ప్రస్తుతం  కాలేజీలో 750 మంది MBBS విద్యార్దులు,,150 మంది PG విద్యార్దులు చదువుకుంటున్నారు..ఆసుపత్రిలో 13 డిపార్ట్ మెంట్స్ కి పేషంట్లు వస్తుంటారు..

ప్రతి సంవత్సరం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని నేషనల్ మెడికల్ కమిషన్,,రాష్ట్రంలోని  వివిధ మెడికల్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంటుంది..సదరు మెడికల్ కాలేజ్ ల్లో సదుపాయలు సరిగా ఉన్నాయా ? విద్యార్థుల సంఖ్య కు సరిపడా అధ్యాపకులు ఉన్నారా ? కాలేజీలో ఉన్న టీచింగ్ ఆసుపత్రులకు పేషెంట్లు వస్తున్నారా ? అనే విషయాలను నేషనల్ మెడికల్ కమిషన్ పరిశీలిస్తుంది..సుజనా చౌదరికి సంబంధించిన మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో MCI నిర్ధేశించిన పలు నిబంధనల ఉల్లంఘనల చోటుచేసుకున్నాయని తెలియ వచ్చింది..నిబంధనలకు విరుద్ధంగా మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్నట్లు తేలింది..దీంతో MCI ఈ కాలేజ్ కి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం..పరిస్థితిలో మార్పు లేకపోవడంతో కాలేజీ గుర్తింపు రద్దు చేస్తున్నట్లు చేసినట్లు ప్రకటించింది..

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *