AMARAVATHINATIONAL

పది రోజుల్లో కోటీ జాతీయ పతాకాలు అమ్మిన పోస్టల్ శాఖ

అమరావతి: 75వ స్వాతంత్య్ర దినొత్సవ వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి పిలుపునిస్తూ,,ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేయాలని దేశ ప్రజలకు సూచించింది..జాతీయ పతాకాల అమ్మకాల్లో పోస్టల్ శాఖ పది రోజుల్లో కోటి జెండాలను విక్రయించింది..పోస్టాఫీసులో ఒక్కో జెండాకు రూ.25 చొప్పున పోస్ట్లల్ శాఖ అందచేస్తుంది..దేశ వ్యాప్తంగా 1.5 లక్షల పోస్టాఫీసుల ద్వారా కోటీ త్రివర్ణ పతాకాలను అమ్మినట్లు కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.. ఇందులో ఆన్ లైన్ ద్వారానే 1.75 లక్షలకు పైగా జెండాలను విక్రయించినట్లు పేర్కొంది.. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా త్రివర్ణ పతకాన్ని బుక్ చేసుకుంటే వారికి ఉచితంగా డెలివరీ చేస్తామని,,దేశవ్యాప్తంగా 4.2 లక్షల మంది  పోస్టల్ ఉద్యోగులు,,ఆయా నగరాలు, పట్టణాలు, గ్రామాలు, సరిహద్దు ప్రాంతాలు, జిల్లాలతో పాటు పర్వత గిరిజన ప్రాంతాలలో “హర్ ఘర్ తిరంగ” సందేశాన్ని ప్రచారం చేశారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *