నాడు-నేడు పేరుతో వేలకోట్లు దోచుకుంటున్నారు-లోకేష్
నెల్లూరు: నాడు-నేడు పేరుతో వేలకోట్లు దోచుకోవడం తప్ప విద్యాప్రమాణాల మెరుగుదలకు ఎటువంటి సి.ఎం జగన్ నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం లేదని,,టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆకుతోటలో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా.లోకేష్ అన్నారు..ఆదివారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర కొనసాగుతున్న నేపధ్యంలో అయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ధ్వసం అయిపోయిన రోడ్లను యుద్ధప్రాతిపదికన పునర్నిర్మిస్తామని చెప్పారు..జగన్ అధికారంలోకి వచ్చాక 56 కార్పేషన్లు ఏర్పాటు చేసి అవి ఎందుకు పనికిరాకుండా చేశారని విమర్శించారు.. బీసీలకు చెందాల్సిన రూ.75,760 కోట్లు దారిమళ్లించిన బీసీల ద్రోహి జగన్ అంటూ మండిపడ్డారు..అన్యాయాలని ప్రశ్నించిన బీసీలపై దాడులు చేస్తూ గొంతునొక్కాలని చూస్తున్నారని,, రాష్ట్రవ్యాప్తంగా బీసీలపై రూ.26వేలకు పైగా తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు..