నెల్లూరుజిల్లాలో మొత్తం ఓటర్లు 19 లక్షల 22 వేల 669 మంది-కలెక్టర్
నెల్లూరు: జిల్లాలో ఓటర్లు జాబితాకు సంబంధించిన క్లెయిమ్ లను త్వరితగతిన పరిష్కరించడంతో పెడింగ్ దరఖాస్తులు గణనీయంగా తగ్గాయని జిల్లా కలెక్టర్ హరినారాయణ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని శంకరన్ హాల్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించిన సందర్భంగా అయన మాట్లాడుతూ జిల్లాలో ఓటర్లు నమోదు కొసం నామినేషన్లు వరకు నమోదు చేసుకోవచ్చున్నారు. జిల్లాలో మార్చి 13వ తేదీ నాటికి పురుషులు 9 లక్షల 41వేల మంది,, మహిళలు 9 లక్షల 81 వేల 459 మంది థర్డ్ జెండర్ 210 మంది మొత్తం కలిపి 19 లక్షల 22 వేల 669 మంది ఓటర్లు ఉన్నారన్నారు. జిల్లాలో ఓటర్ల జాబితా ప్రచురణ పై వచ్చిన ప్రతికూల వార్తలపై స్పందించి చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ తెలియజేశారు. జిల్లాలో ఓటర్ల జాబితా ప్రచురణ తరువాత వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి చర్యలు తీసుకున్నామన్నారు.