నాలుగురు ఎమ్మేల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ
అమరావతి: ఎమ్మేల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డరంటూ అధికార వైసీపీ చర్యలు చేపట్టింది.. ఆనం.రామనారయణ రెడ్డి,,ఉండవల్లి శ్రీదేవి,,మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డి,,కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల.రామకృష్ణారెడ్డి తెలిపారు..క్రాస్ ఓటింగ్ పై అంతర్గతంగా విచారణ చేశామని, దర్యాప్తులో క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లుగా పార్టీ గుర్తించడంతో ఎమ్మెల్యేలపై వేటు వేశామన్నారు..ఒక్కో ఎమ్మెల్యేకు చంద్రబాబు 15 నుంచి 20 కోట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు..క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్లకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున టికెట్ ఇస్తానని చెప్పి ఉండవచ్చునని సజ్జల అన్నారు.