ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ (ఈనెల 20 వరకూ) విధించింది..ఆయనను తీహార్ జైలుకు తరలించారు..ఇప్పటికే వారం రోజుల పాటు సిసోడియాను సీబీఐ అధికారులు ప్రశ్నించించారు..ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఫిబ్రవరి 26వ తేదిన సిసోడియాను 8 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు ఆ తర్వాత అరెస్ట్ చేశారు..ప్రక్కరోజు సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం 5 రోజుల సిబిఐ కస్టడీకి అనుమంతించింది..అనంతరం మళ్లీ కోర్టు ప్రవేశపెట్టగా మరో రెండు రోజుల కస్టడీ విధించింది..నేటితో గడువు ముగియడంతో సీబీఐ అధికారులు ఇవాళ మరోసారి సిసోడియాను కోర్టులో ప్రవేశపెట్టారు..సిసోడియాను తీహార్ జైలుకు తరలించే ప్రాంతంలో బలగాలు పెద్ద సంఖ్యలో మోహరించాయి.