ముంబై,నాగపూర్ లో ఈడీ జరిపిన సోదాల్లో రూ.5.51 కోట్ల విలువైన ఆభరణాలు
అమరావతి: మనీలాండరింగ్ కేసులో ముంబై,,నాగపూర్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్(ED) ఏకకాలంలో 15 వేరు వేరు ప్రదేశాల్లో దాడులు జరిపింది..ఈ సోదాల్లో పంకజ్ మెహదీయా,,లోకేష్ జైన్,,కార్తీక్ జైన్ చెందిన నివాసాలు,, కార్యాలయాల్లో రూ.5.51 కోట్ల విలువైన ఆభరణాలు,,రూ.1.21 కోట్ల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు..అలాగే వారు ఆఫీసులోనే డబ్బును లెక్కేంచే డిజిటల్ యంత్రాలు,కంప్యూటర్లు,, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో వెల్లడించింది..
పెట్టుబడిదారులకు 12 శాతం వడ్డీ ఇస్తామంటూ,2004 నుంచి 2017 వరకు వివిధ పోంజీ స్కీమ్ లను(అధిక వడ్డీ ఆశ) చూపించి మోసగించింది..సూట్ కేసు కంపెనీల ప్రారంభించి,వీరి వద్ద నుంచి కోట్ల రూపాయలు కాజేశారు..ఈ కేసులో పంకజ్,,లోకేష్ జైన్,, కార్తీక్ డిజైన్,,బల్ముకుంద్ లాల్ చంద్,,ప్రేమలత మెహదియాలపై సీతాబుల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది..ఈఢీ, FIR ఆధారంగా దర్యాప్తు ప్రారంభించింది..ఒకే సారి నిందితుల నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించడం జరిగిందని,,పెద్ద మొత్తంలో వజ్రాల నగలు,,బంగారు ఆభరణాలు,,నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ పేర్కొంది.