జమ్మూ కాశ్మీర్ విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ
అమరావతి: ‘నో యువర్ కంట్రీ’ కార్యక్రమం కింద దేశవ్యాప్త పర్యటనకు బయలు దేరిన జమ్మూ కాశ్మీర్ విద్యార్థులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు..జమ్మూ కాశ్మీర్ లోని అన్ని జిల్లాల నుంచి వెనుకబడిన ప్రాంతానికి చెందిన 250 మంది విద్యార్థులు భారత దేశాన్ని సందర్శిస్తున్నారు..ఈ విద్యార్థులు ఇప్పటివరకు జైపూర్, అజ్మీర్, ఢిల్లీ ప్రాంతాలను సందర్శించారు..‘వతన్ కో జానో’ కార్యక్రమం కింద ఆదివారం జమ్మూ కాశ్మీర్ లోని 250 మంది విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు..ఈ సందర్భంగా విద్యార్థులు చప్పట్లతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు..ప్రధాని మోదీ విద్యార్థులతో ఫొటోలు దిగారు..విద్యార్థుల అలవాట్లు, అభిరుచులు, లక్ష్యాల గురించి ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు..దేశంలో విద్యా, ఉద్యోగ, క్రీడా సౌకర్యాలను మెరుగుపరుస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు..జమ్మూ కాశ్మీర్ లో ‘స్పోర్ట్స్ ఫర్ ఏఐఐ’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నట్లు మోదీ ప్రకటించారు.