క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై ఉండే 21 రోజులు ఆయన ఏం చేయాలో,, ఏం చేయకూడదో కోర్టు నిర్దేశించింది.. బెయిల్ సమయంలో కేజ్రీవాల్ సీఎం కార్యాలయానికి వెళ్లవద్దని,, ఎలాంటి ఫైల్స్ మీద కూడా సంతకాలు చేయవద్దని సర్వోన్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొన్నది..
కోర్టు షరతులు:- 1-జైలు నుంచి విడుదల కావడానికి ముందు కేజ్రీవాల్ రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో బాండ్ రాసివ్వాలి..2-బెయిల్పై ఉన్నన్ని రోజులు కేజ్రీవాల్ సీఎం కార్యాలయానికిగానీ,, ఢిల్లీ సెక్రెటేరియట్కు గానీ వెళ్లకూడదు..లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చు..3-ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి లేకుండా ఎటువంటి అధికారిక ఫైళ్లపై కూడా కేజ్రీవాల్ సంతకం చేయకూడదు..4-ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు గురించిగానీ,, ఆ కేసులో తనపై వచ్చిన ఆరోపణల గురించిగానీ కేజ్రీవాల్ ఎలాంటి ఆరోపణలు చేయకూడదు..5-ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సాక్ష్యులుగా ఉన్న వ్యక్తులను కేజ్రీవాల్ కలువగూడదు, వారితో మాట్లాడకూడదు.