జ్ఞానవాపి ప్రాంగణంలో పూజలకు అనుమతించిన కోర్టు
ఫిభ్రవరి 6వ తేదీకి వాయిదా..
అమరావతి: జ్ఞానవాపి కేసులో బుధవారం కీలక మలుపు చోటు చేసుకుంది.. జ్ఞానవాపి ప్రాంగణంలో పూజలు చేసేందుకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది..దీంతో జ్ఞానవాపిలో హిందువు దేవతా విగ్రహాలకు పూజలు చేసే అవకాశం దక్కింది..జ్ఞానవాపి వ్యాసాజీ బేస్ మెంట్ లో పూజలకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై ఇరువర్గాలు వాదనలు అలకించిన కోర్టు కీలక తీర్పును వెల్లడించింది.. సీల్ చేసిన 10 సెల్లార్లలో హిందూ దేవతల ప్రతిమలకు పూజలకు ఏర్పాట్లు చేయాలని పేర్కొంది.. శైలేంద్ర కుమార్ పాఠక్ వ్యాస్, విష్ణు శంకర్ జైన్, సుధీర్ త్రిపాఠి, సుభాష్ నందన్ చతుర్వేది, దీపక్ సింగ్ లు కోర్టులో వాదనలు వినిపించారు..నంది విగ్రహానికి ఎదురుగా ఏర్పాటు చేసిన బారికేడింగ్ను తెరిచేందుకు అనుమతించాలని,,1993కి ముందు తరహాలోనే బేస్మెంట్లో పూజలకు వెళ్లేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.. దీనిపై ఇంతేజామియా మసీదు కమిటీ తరఫున ముంతాజ్ అహ్మద్, ఇఖ్లాక్ అహ్మద్ అభ్యంతరం వ్యక్తం చేశారు.. బేస్మెంట్ మసీదులో భాగమని,, అక్కడ పూజలు చేయడానికి వీలేదన్నారు..ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు హిందువులకు పూజలు చేసేందుకు అనుమతి ఇస్తూ, వారంలో పూజలు చేసుకునేలా ఏర్పాటు చేయాలని ఆదేశించింది..తదుపరి విచారణను వారణాసి కోర్టు ఫిభ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది..ఈ సందర్భంగా హిందూపక్షం న్యాయవాది మాట్లాడుతూ కోర్టు ఆదేశం కీలక మలుపు అన్నారు. పూజలకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉందన్నారు.