ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు కలిశారు,, మేనిఫెస్టో పేరుతో సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ అంట. ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు అంట. నమ్ముతారా? అంటూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధ్యక్షడు చంద్రబాబును ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు.శనివారం నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ లో నిర్వమించిన బహిరంగ సభలో అయన మాట్లాడుతూ మన బతుకులు బాగుపడాలన్నా,, పేదల భవిష్యత్తు మారాలన్నా,, లంచాలు లేని అవినీతి రహిత పాలన కొనసాగాలన్నా.. ఫ్యాన్ బటన్ పై రెండు బటన్లు నొక్కాలని ప్రజలను కోరారు. చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీ తెలుసా? దీని అర్థం భూములు మీద సంపూర్ణ హక్కులు రైతులకు ఉండేలా చేసిన చట్టం పేరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్…రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుందని చెప్పారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికిైన ఒక్క మంచి పథకం గుర్తువస్తుందా? అంటూ నిలదీశారు. నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్దులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.