AMARAVATHIHYDERABADMOVIE

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చి సినీ పరిశ్రమలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆయన, కోవిడ్ సమయంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజెన్ బ్యాంకు ఏర్పాటు చేసి సమాజ సేవలో తన వంతు పాత్ర పోషించారు.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది..వారిలో 67 మందికి ఏప్రిల్ 22వ తేదీన పద్మ అవార్డుల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయగా, మిగిలిన 65 మందికి గురువారం సాయంత్రం 6:30 గంటల నుంచి ప్రదానం చేశారు.. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు.. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉపరాష్ట్రపతి, పలువు కేంద్రమంత్రులతో పాటు అధికారులు హాజరయ్యారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *