AMARAVATHICRIMENATIONAL

జమ్మూకశ్మీర్ లో లొయ పడిపొయిన బస్సు-38 మృతి

అమరావతి: జమ్మూకశ్మీర్ లో బుదవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకంది..ఈ సంఘటనలో 38 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పొగా మరి కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి.. పోలీసులు తెలిపిన వివరాల ఇలా వున్నాయి.. కిష్త్వర్ నుంచి జమ్మూ కశ్మీర్ కు 60 మంది ప్రయాణికులతో ఓ ప్రవేట్ బస్సు బయల్దేరింది.. బటోట్-కిష్త్వర్ జాతీయ రహదారిపై ట్రుంగల్-అస్సార్ సమీపంలో రాగానే ఏటావాలుగా వున్న రోడ్డుపై బస్సు అదుపు తప్పి పక్కనే 300 అడుగుల లోతులో ఉన్న లోయలోకి పడిపొయింది..సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలంకు చేరుకుని మృ ల తదేహాలను వెలికితీస్తున్నట్లు అధికారులు తెలిపారు..క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.. బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంతాపం తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *