AMARAVATHIPOLITICS

గొవిందా గొవిందా,తిరుమలకు 10% కరుణాకర్ రెడ్డి వచ్చాడు-ఆనం.వెంకటరమణారెడ్డి

ధర్మారెడ్డిపైన క్రిమినల్ కేసులు..

అమరావతి: భూమున కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయ్యాక దేవస్థానం డబ్బుల్ని తన కొడుకు అభినవ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు.గురువారం మంగళగిరిలోని టీడీపీ కార్యాయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లడుతూ తిరుపతి పరిధిలో ఏ పనికైనా 10 శాతం తీసుకుంటున్న భూమన కరుణాకర్ రెడ్డిని ఇప్పటికే 10శాతం కరుణాకర్ రెడ్డిగా పిలుస్తున్నారన్నారని మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారపార్టీ నేతల అవినీతికి అడ్డాగా మారిందని చెప్పారు.

ధర్మారెడ్డి అవినీతిపై 14 సెక్షన్ల కింద ఢిల్లీలో క్రిమినల్ కేసు నమోదైందని ఆనం తెలిపారు. తనపై ఉన్న క్రిమినల్ కేసుని దాచిపెట్టి ధర్మారెడ్డి టీటీడీ FACగా బాధ్యతలు చేపట్టరని విమర్శించారు..రాష్ట్రంలో వున్న IASలను కాదని, క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తికి టీటీడీలో కీలక పదవి ఎలా ఇస్తారని ఆనం ప్రశ్నించారు. టీటీడీని అడ్డం పెట్టుకుని ఢిల్లీలో ధర్మారెడ్డి లాబీయింగ్ చేస్తున్నాడన్నారు. ఢిల్లీలో నమోదైన కేసుపై తీర్పు వచ్చే వరకూ ధర్మారెడ్డిని టీటీడీ బాధ్యతల నుంచి తప్పించాలని ఆనం డిమాండ్ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *