AMARAVATHI

ఆంధ్రప్రదేశ్ కు పొంచి వున్న “మిధిలీ” తుపాను ముప్పు

అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంను ఆనుకుని ఉన్న అండమాన్ నికోబార్ దీవులపై 14వ తేదిన అల్పపీడనం ఏర్పడింది.. నవంబర్ 15న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారి, నవంబర్ 16 నాటికి ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని,, తుఫానుగా బలపడితే దీనికి మిధిలీ అని నామకరణం చేయనున్నట్లు భారత వాతావరణశాఖాధికారులు పేర్కొన్నారు..ఈ సారి తుపానుకు పేరును మాల్దీవులు సూచించింది..ఈ మిధిలీ తుఫాను గురువారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని తీవ్ర అల్పపీడనంగా మారుతుందని,,ఈశాన్య దిశగా సాగి శుక్రవారం నాటికి ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారుతుందని హెచ్చరించింది. దీని ప్రభావంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని తెలిపింది..

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలోనూ భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి..నగర శివారు ప్రాంతాల్లోనూ బుధవారం నాడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే కారైక్కాల్, కడలూరు, విల్లుపురం, నాగపట్నం జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అయింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *