బ్రిడ్జీ కూలి పోవడంతో నదిలో పడిపోయిన గూడ్స్ రైలు
అమరావతి: అమెరికాలోని కొలంబస్ పట్టణంలో నదిపై నిర్మించిన రైలు వంతెన కూలిపోవడంతో సరకుల గూడ్స్ ట్రైయిన్ నదిలో పడిపోయింది..తారు,,సల్ఫర్ వంటి ప్రమాదకరమైన పదార్థాలతో గూడ్స్ రైలు మోంటానాలోని ఎల్లోస్టోన్ నదిని దాటుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది..నదిలో ప్రమాదకర సల్ఫర్, వేడి తారు కలసిపోవడటంతో దిగువ ప్రాంతంలో నది నుంచి నీరు తీసుకోవడాన్ని అధికారులు నిలిపివేశారు..రైలు సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, ఎలాంటి గాయాలు కాలేదని మోంటానా రైల్ లింక్ ప్రతినిధి ఆండీ గార్లాండ్ ఒక ప్రకటనలో తెలిపారు..అమెరికాలో కురుస్తున్న భారీవర్షాల వల్ల వరదనీరు నదిలో పొంగిప్రవహిస్తోంది.