విజయవాడ,చెన్నై మధ్య వందే భారత్ రైలు
అమరావతి: రాష్ట్రంలో మరో వందేభారత్ రైలు పరుగులు పెట్టనున్నది..విజయవాడ చెన్నై మధ్య ఈ రైలు ఈ నెల 7వ తేదీ నుంచి రాకపోకలు సాగించనున్నది..ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్ గా 5 వందేభారత్ రైళ్లను ప్రారంభించాడు..అందులో విజయవాడ,చెన్నై మధ్య రైలు కూడా ఒకటని విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు..వందేభారత్ రైలు పరుగులు పెట్టించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు..ఈ రైలు 8వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో రాకపోకలు సాగిస్తుందని అధికారులు పేర్కొన్నారు.. విజయవాడ నుంచి రేణిగుంట మీదుగా చెన్నైకు నడపాలని విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు భావిస్తున్నారు..ఈ విధంగా చూస్తే విజయవాడ నుంచి బయలుదేరే వందేభారత్,,గూడూరు,,రేణిగుంట,,కాట్పాడి మీదుగా చెన్నైకు చేరుకుని మళ్లీ అదే మార్గంలో తిరిగి విజయవాడలకు వస్తుంది..దీని ప్రయాణ సమయం 6.30 గంటలు.