AMARAVATHINATIONAL

ఇద్దరు ఎన్నికల కమీషనర్లను నియమించిన హైపవర్డ్ కమిటీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లను నియమించింది..కేరళకు చెందిన జ్ఞానేశ్వర్ కుమార్, పంజాబ్‌కు చెందిన సుఖ్‌బీర్ సింగ్ సంధూలనూ నియమిస్తూ హైపవర్డ్ కమిటీ నిర్ణయం తీసుకుంది,, ఎలక్షన్ కమిషన్ ప్యానెల్‌లో ఏర్పడ్డ రెండు ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ గురువారం ప్రధాని నేతృత్వంలో హైపవర్డ్‌ కమిటీ సమావేశం అయ్యింది.. మొత్తం 212 మంది అభ్యర్దుల అప్లికేషన్లు రాగా అందులో పై ఇద్దరిని ఫైనల్ చేసింది కమిటీ.. జ్ఞానేశ్ కుమార్ 1988 బ్యాచ్ ఐఏఎస్. మినిస్ట్రీ ఆఫ్ కో అపరేటివ్ లో పనిచేస్తున్నారు. గతంలో మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంట్ ఎఫైర్స్ లో పనిచేశారు. సుఖ్‌బీర్ సింగ్ సంధు ఉత్తరాఖండ్ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈ సంవత్సరం జనవరి 31న ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేశారు. గతంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్‌గా పనిచేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *