నౌకాదళం అధునాతన తేలికపాటి నేవీ హెలికాప్టర్ కు ప్రమాదం
అమరావతి: ముంబయి సముద్ర తీరంలో భారత నౌకాదళానికి చెందిన అధునాతన తేలికపాటి (ALH) చాపర్ బుధవారం ఉదయం కూలిపోయింది.. నేవీ పెట్రోలింగ్ క్రాప్ట్ ద్వారా వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి, హెలికాప్టర్లోని ముగ్గురు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకుని రావడం జరిగిందని నావికాదళం ఒక ప్రకటనలో తెలిపింది..ప్రమాదం జరిగేందుకు గల కారణాలను తెలుసుకొనేందుకు ఘటనపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు..ప్రమాదం జరిగిన ప్రదేశం సముద్ర తీరానికి దగ్గరగా ఉండడంతో తక్షణమే నౌకాదళ పెట్రోలింగ్ క్రాప్ట్ ద్వారా ముగ్గురు సిబ్బందిని సురక్షితంగా రక్షించడం జరిగిందని వెల్లడించారు.