అయోధ్య రామ మందిర ప్రసాదం అంటూ అమెజాన్ స్వీట్స్ అమ్మకాలు-నోటీసులు ఇచ్చిన కేంద్రం
అమరావతి: అమెజాన్ ఆన్ లైన్ విక్రయాల సంస్థ “అయోధ్య రామ మందిర ప్రసాదం” అంటూ స్వీట్స్ ను అమ్మకాలు మొదలు పెట్టింది..కేంద్ర ప్రభుత్వం స్వీట్ల అమ్మకాలకు సంబంధించి మోసపూరిత వ్యాపార విధానాలు అమెజాన్ చేపట్టిందని నోటీసులు జారీ చేసింది..అయోధ్యలో రామమందిరాన్ని ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఇంకా ప్రారంభించలేదు..అటువంటిది ఆ మందిర ప్రసాదం పేరిట స్వీట్లను విక్రయిస్తు,,వినయోగదారులను తప్పుదోవ పట్టిస్తోందని అమెజాన్ పై,, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫిర్యాదు చేయడంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.. అమెజాన్ ప్రకటనలు కస్టమర్లను తప్పుదారి పట్టించాయని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ పేర్కొంటూ అమెజాన్ కు నోటీసులు పంపింది..ఈ నోటీసుపై సమాధానం ఇచ్చేందుకు అమెజాన్ కు 7 రోజుల గడువు ఇచ్చింది. .సమాధానం ఇవ్వకపోతే నిబంధనల ప్రకారం అమెజాన్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.