రైలు, ఫ్లాట్ ఫామ్ మధ్య చిక్కుకునిపోయిన విద్యార్దిని

అమరావతి: అన్నవరానికి చెందిన శశికళ దువ్వాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో MCA 1st ఇయర్ చదువుతోంది.బుధవారం ఉదయం కాలేజీకి వెళ్లేందుకు గుంటూరు, రాయఘడ్ ప్యాసింజర్ లో ప్రయాణించిన ఆమె,, విశాఖపట్టణంలోని దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పైకి దిగుతుండగా ప్రమాదవశాత్తు రైలు, ఫ్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుపోయింది. భాదితురాలి అరుపులు విని,, రైల్వే సిబ్బంది రైలును స్టేషన్ లోనే నిలిపివేశారు. ఆమెను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. గంటన్నరపాటు కష్టపడి, ఫ్లాట్ ఫామ్ ను పగులగొట్టి యువతి ప్రాణాలను కాపాడారు.అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.