AMARAVATHIPOLITICS

ఏపీలో అన్నా, చెల్లెళ్లు కొత్త నాటకాలకు ప్రజలే తగిన బుద్ది చెబుతారు-బీజెపీ

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,,కొత్తగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లు వేర్వేరు కాదని,,వారిద్దరూ కలిసే రాబోయే ఎన్నికల కోసం ఈ కొత్త నాటకంకు తెరతీశారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు.. గురువారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ జగన్ ఎంపిక చేసిన అభ్యర్థులు మధ్యలోనే జారీపోతున్నరని ఎద్దేవా చేశారు..ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అనే పార్టీ ఛీతర్కరిచుంకుంటున్నరని,,ఏ మోహం పెట్టుకుని కాంగ్రెస్ ఏపీ ప్రజల ముందుకు వస్తుందని ప్రశ్నించారు.. షర్మిల ఒక రాజకీయ నిరుద్యోగి అని.. ఏపీలో కాంగ్రెస్ ఖాళీగా ఉండడంతో ఆమె దరఖాస్తు చేసుకుని అధ్యక్షరాలు అయ్యారని సెటైర్లు వేశారు.. అన్నా, చెల్లెళ్ల డ్రామాలకు ప్రజలే తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు..అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం అందరూ హర్షించదగ్గదేనని,,అయితే ఎస్సీ వర్గాలకు గత నాలుగేళ్లుగా అన్యాయం చేసి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పేరుతో రాజకీయం చేయడాన్ని బీజేపీ తప్పుబడుతోందన్నారు..కేంద్రం ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను సీఎం జగన్ దారి మళ్లించారని విమర్శించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *