భారీ అంబేద్కర్ విగ్రహంను ఆవిష్కరించిన సీఎం జగన్
అమరావతి: దేశం గర్వించతగ్గ నాయుకుడు,,సామాజిక న్యాయ మహా శిల్పం క్రింద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం,,ఇక నుంచి స్టాట్యూ ఆప్ సోషల్ జస్టిస్ అంటే విజయవాడ గుర్తుకు వస్తుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు..శుక్రవారం విజయవాడ నగరంలోని స్వరాజ్ మైదాన్ లో రాజ్యాంగ రూపకర్త బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహ ఆవిష్కరణ సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరగింది.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అంబేద్కర్ అభిమానులు హాజరయ్యారు..అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి 120 మెట్రిక్ టన్నుల కాంస్యం,, 400 మెట్రిక్ టన్నుల స్లెయిన్ లెస్ స్టీల్ వినియోగించారు.. స్మృతివనం ప్రహరీ చుట్టూ 2,200 మెట్రిక్ టన్నుల రాజస్థాన్ పింక్ ఇసుక రాయిని ఉపయోగించారు.