AMARAVATHINATIONAL

భారతదేశ ప్రజల అవసరల కోసం సురక్షితమైన పబ్లిక్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని సృష్టించాం-ప్రధాని మోదీ

అమరావతి: భారతదేశ ప్రజల అవసరల కోసం సురక్షితమైన,, సమర్థవంతమైన పబ్లిక్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని సృష్టించామని,ఈ వ్యవస్థ డిజిటల్ చెల్లింపులు,,పాలన,,ఆర్థిక,,జీవనోపాధి స్వరూపంను సమూలంగా మార్చివేసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..బెంగళూరులో ప్రారంభమైన G-20 ఆర్థిక మంత్రులు,,సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ ప్రసంగించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ వినియోగదారులు, తయారీదారులు భవిష్యత్తు గురించి ఆశాజనకంగా, నమ్మకంగా ఉన్నారని,,మీరు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అదే సానుకూల స్ఫూర్తిని అందించాలని కోరారు..మీ చర్చ ప్రపంచంలోని అత్యంత బలహీనమైన పౌరుల ఆర్దిక అవసరాలపై దృష్టి పెట్టాలని తాను కోరుతున్నాని అన్నారు.. గ్లోబల్ ఎకనామిక్ లీడర్‌షిప్ ఒక సమగ్ర ఎజెండాను రూపొందించడం ద్వారా మాత్రమే ప్రపంచ నమ్మకాన్ని తిరిగి పొందగలుగుతుందని అన్నారు.. కోవిడ్ మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని,,అనేక దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, ఇప్పటికీ దుష్పరిణామాలను ఎదుర్కొంటున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు..మా G-20 ఛైర్మన్‌షిప్ సమావేశానికి వచ్చిన గ్లోబల్ G20 గెస్ట్‌ లు UPIని ఉపయోగించడానికి అనుమతించే కొత్త ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌ను సృష్టించామని,,ఇది భారత డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫారమ్ అని అన్నారు..బెంగళూరులో జరుగుతున్న G-20  ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల తొలి సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *