AMARAVATHINATIONAL

ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన అన్నమలై

అమరావతి: సనాతన ధర్మంపై ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు,క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఘాటుగా స్పందించారు.. సనాతన ధర్మం మలేరియా, డెంగీ వ్యాధుల లాంటిదని, దాన్ని నిర్మూలించాల్సిందేనని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే..ఈ వ్యాఖ్యలపై గురువారం అన్నమలై ఓ వీడియోను విడుదల చేశారు.. తమిళనాడు అధికారంలో వున్న DMK పార్టీనే,,డెంగీ, మలేరియా, ప్రతి రూపంగా అయన అభివర్ణించారు.. తమిళనాడు నుంచి దేన్నైనా నిర్మూలించాలని అనుకుంటే,, అది DMK పార్టీనే మాత్రమే అని అన్నారు..అన్ని మతాల ఉనికి తెలియక ముందే, సనాతన ధర్మం ఆచరణలో ఉందన్నారు..
మానవులే దేవుళ్ల ప్రతి రూపాలని, సనాతన ధర్మం పేర్కొంటుందన్నారు..అలాగే జీవరాశులు దేవుడిలా పూజించడం గురించి తెలియచేస్తుందని చెప్పారు..సనాతన ధర్మంలో ఎవరైనా వివక్షను తీసుకొస్తే, మరో వ్యక్తి వచ్చి దాన్ని సంస్కరిస్తాడని,,స్వామి దయానంద సరస్వతి, స్వామి సహజానందలు ఇటువంటి గొప్ప సంస్కరణలే చేశారని తెలిపారు..ఉదయనిధి స్టాలిన్ మాత్రం మొత్తం సనాతన ధర్మాన్నే నిర్మూలించాలని మాట్లాడుతున్నారని,, ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కు సనాతన ధర్మం గురించి ఏం అర్థం చేసుకున్నారో తెలుస్తోందని అన్నారు.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *