డోనాల్డ్ ట్రంప్ తో కలిసి గోల్ఫ్ అడిన ధోని
అమరావతి: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఒక మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానించే వారు ఎందరో..భారత్ జట్టుకు ఎన్నో విజయాలను అందించిన ధోనీకి క్రికెట్ తో పాటు ఫుట్ బాల్ అంటే ఎంతో ఇష్టం..అలాగే టెన్నిస్ ను కూడా ఆస్వాదిస్తారు..యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో కార్లోస్ అల్కరాజ్ ఆడుతున్న మ్యాచ్ ను చూసేందుకు ధోని ఇటీవల అమెరికాకు వెళ్లెడు..ప్రస్తుతం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో కలిసి కొంత సమయం సరదాగా గడిపారు..ట్రంప్ న్యూజెర్సీ బెడ్ మిన్ స్టర్ లోని నేషనల్ గోల్ఫ్ క్లబ్ లో గోల్ఫ్ ఆడేందుకు భారత మాజీ కెప్టెన్ ధోనిను ఆహ్వానించారు..ఈ సందర్భంగా ట్రంప్ తో కలిసి మహి గోల్ఫ్ అడారు..ధోని వెంట దుబాయికి చెందిన వ్యాపారవేత సంఘ్వీ కూడా ఉన్నారు..ప్రస్తుతం సోషల్ మీడియాలో అమెరికా మాజీ ప్రెసిడెంట్ తో ధోనీ గోల్ఫ్ ఆడిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతున్నాయ.