AMARAVATHIINTERNATIONAL

కెనడాలో మరో ఖలిస్థానీ సునుభూతి పరుడు హత్య

అమరావతి: ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతూన్ననేపధ్యంలో కెనడాలో మరో ఖలిస్థానీ సానుభూతి పరుడు హత్యకు గురయ్యాడు..కెనడాలోని విన్నిపెగ్ లో బుధవారం రాత్రి జరిగిన దాడిలో సుఖ్ దోల్ సింగ్ అలియాస్ సుఖా దునెకే మృతి చెందినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి..ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు..ఈ హత్య తమ పనేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో ప్రకటించుకుంది..హత్యకు గురైన సుఖా దునెకే పంజాబ్ లోకి మోఘా జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు..2017లో సుఖా దునెకే నకిలీ సర్టిఫికేట్లతో కెనడాకు పారిపోయినట్లు తెలుస్తోంది..
కెనడాలో గ్యాంగ్ స్టర్ అర్షదీప్ సింగ్ ముఠాలో చేరి ఖలీస్థానీ ఉద్యమంలో సుఖ్ దోల్ కీలకంగా పనిచేస్తున్నట్లు సమాచారం..హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్, కెనడాల మధ్య వివాదం మొదలైన నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనించ తగిన ఆంశం..ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ అధినేత నిజ్జర్ ఈ సంవత్సరం జూన్ లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలోని గురుద్వారలో దుండగులు అతడిని కాల్చి చంపారు..ఈ విషయంపై కెనడా ప్రధాని ట్రూడో,వారి పార్లమెంట్ లో మాట్లాడుతూ,,ఈ హత్య భారత్ కు చెందిన అధికారులు చేయించినట్లు అనుమానం వుందంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు..ఈ వ్యాఖ్యల అనంతరం భారత్, కెనడాల మధ్య వివాదం రోజురోజుకు ముదురతోంది..ఈ నేపథ్యంలో కెనడా విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.. భారత్ కు వచ్చే కెనడా పౌరులకు వీసాలు మంజూరు చేయరాదని భారత్ నిర్ణయించింది.. నిర్వహణపరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కెనడాలోని భారత హైకమిషన్ ప్రకటించింది..ఈ నిర్ణయం గురువారం నుంచి అమల్లోకి వచ్చింది..ఇదే సమయంలో కెనడా వ్యవహారాన్ని చర్చించేందుకు ప్రధాని మోదీ అత్యున్నత సమావేశం ఏర్పాటు చేశారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *