AMARAVATHI

నగదు పంపిణీ పథకాల నుంచి వాలంటీర్లను తప్పించండి-ఈసీఐ

డీఎస్సీ పరీక్షలు వాయిదా..

అమరావతి: పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా పెట్టాలని,,అన్ని నగదు పంపిణీ పథకాల నుంచి వాలంటీర్లను విధులను నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.. హైకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది..ఎన్నికల కోడ్‌ ముగిసేవరకు వాలంటీర్ల వద్ద వున్న ట్యాబ్, మెుబైల్‌ను కలెక్టర్ల వద్ద డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది..నగదు పంపిణీ పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగులను వాడుకోవాలని సూచించింది.

 డీఎస్సీ పరీక్షలు వాయిదా:- ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున DSC పరీక్షలను వాయిదా వేయాలంటూ భారత ఎన్నికల సంఘం ఆదేశాలు చేసింది..ఎన్నికల కోడ్ ముగిసే వరకు డీఎస్సీని వాయిదా వేయాలని స్పష్టం చేసింది..అలాగే ఏపీ టెట్ ఫలితాల విడుదలకు కూడా ఎన్నికల సంఘం నిలిపి వేసింది..రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసేంత వరకూ టెట్ ఫలితాలను సైతం వాయిదా వేయాలని ఆదేశించింది..ఎన్నికల కోడ్ ముగిశాక ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది.. ఇక టెట్ ఫలితాలను కూడా హైకోర్టు ఆదేశాల మేరకు వెల్లడించవచ్చునని తెలిపింది..ఈమేరకు ఏపీ సీఈఓకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *