AMARAVATHIDISTRICTS

జిల్లాలోని 8 నియోజక వర్గాల్లో కొత్తగా 8 పొలింగ్ కేంద్రాలు-కలెక్టర్

నెల్లూరు: ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మర్ రివిజన్ లో భాగంగా జిల్లాలో నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల మార్పు తదితర అంశాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్,  రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు..గురువారం కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో స్పెషల్ సమ్మర్ రివిజన్-2024లో బాగంగా ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ తదితర అంశాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో  జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ సమావేశం నిర్వహించారు.ఈ సంధర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియపై ఏవైనా సూచనలు వుంటే సంబంధిత ఈ.ఆర్.ఓ ల దృష్టికి తీసుకురావాలని కోరారు.జిల్లాలోని 8 నియోజక వర్గాల పరిధిలో ప్రస్తుతం 2,303 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, కొత్తగా ఎనిమిది పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించామని, వాటిలో కందుకూరు నియోజకవర్గంలో 2, కోవూరు నియోజకవర్గంలో 1, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3,  సర్వేపల్లి నియోజక వర్గంలో 2  ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతిపాదించిన 8 పోలింగ్ కేంద్రాలతో కలుపుకొని మొత్తం పోలింగ్ కేంద్రాలు  సంఖ్య 2,311కు చేరనుందని తెలిపారు. 1350 మంది ఓటర్లు కల్గిన పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైతే అదనపు పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్, ఈఆర్ఓలను ఆదేశించారు. ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా కార్యక్రమం కింద అక్టోబర్ 17వ తేదీన డ్రాఫ్ట్ పబ్లికేషన్ ప్రచురించడం  జరుగుతుందన్నారు. ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మర్ రివిజన్ లో భాగంగా ఇంటింటి సర్వేలో గుర్తించిన, పెండింగ్ లో ఉన్న అన్ని ఓటరు క్లెయిములు, అభ్యంతరాలను పారదర్శకంగా పరిష్కరించడంతో పాటు తప్పులు లేని, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి జిల్లా యంత్రాంగం అనేక జాగ్రత్తలు తీసుకోవడం జరుగుచున్నదని, వీటికి సంబందించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా తెలియ జేయాలని కలెక్టర్, రాజకీయ పార్టీల ప్రతినిధులను  కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *