AMARAVATHIDISTRICTS

రూ.లక్ష దాటిన నగదు లావాదేవీలపై బ్యాంక్ అధికారులు నివేదిక ఇవ్వాలి-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లక్ష రూపాయలు దాటిన నగదు లావాదేవీలపై బ్యాంక్ అధికారులు నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్,ఎన్నికల అధికారి నారాయణన్ అన్నారు. మంగళవారం ఎన్నికల సందర్భంగా బ్యాంకు అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసిన నాటినుండి తరచుగా వారి ఖాతాలను పరిశీలించాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీల అభ్యర్థులకు కొత్త బ్యాంక్ ఖాతాలను ప్రారంభించాలన్నారు. అలాగే 10 లక్షల రూపాయలపై బ్యాంకుల్లో జరిగిన లావాదేవీలపై జిల్లా ఎన్నికల అధికారికి నివేదికలు ఇవ్వాలన్నారు.ఒకే ఖాతా నుండి పలుసార్లు నగదు లావాదేవీలు జరిగిన ఖాతాలను పరిశీలించాలన్నారు. బ్యాంకుల నుండి ఏ.టీ.ఎం కు రవాణా చేసే నగదు వాహనాల కు క్యూఆర్ కోడ్ ఇవ్వాలన్నారు. అనుమానస్పద లావాదేవిలపై బ్యాంకు అధికారులు ప్రతిరోజు నివేదిక ఇవ్వాలని ఆయన అన్నారు.ఈ సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రదీప్, ఎన్నికల ఖర్చు మానిటరింగ్ నోడల్ ఆఫీసర్ విద్యాసాగర్, బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *