AMARAVATHI

రేపు,ఎల్లుండి రాష్ట్రంలో వడగాల్పులు-విపత్తుల నిర్వహణ సంస్థ

అమరావతి: బిపొర్ జాయ్ తుపాను కారణంగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో తమ ప్రబావం చూపలేక పోతున్నాయి పర్యావసనంగా రేపు 43 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 266 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 56 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 294 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అమరావతి విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు.

సోమవారం మన్యం జిల్లా సాలూరులో44.9°C, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో44.8°C, తిరుపతి జిల్లా పెద్ద కన్నాలిలో44.5°C, ప్రకాశం జిల్లా దొనకొండ, కాకినాడ జిల్లా కరపలో43.8°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 46 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 184 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *