AMARAVATHI

విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు హైకోర్టు అనుమతి

అమరావతి: డిమాండ్ల పరిష్కారం కోసం విద్యుత్ కార్మిక సంఘాలు విజయవాడలో నిర్వహించబోయే ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది..ధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విద్యుత్ సంఘాలు వేసిన పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపి షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది..ఈనెల 10న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటలలోపు ధర్నా చేసుకోవాలని ఉద్యోగుల సంఘానికి సూచించింది..ధర్నా నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, ఏపీ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్, ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం విదితమే..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *