లోక్ సభలో టియర్ గ్యాస్ ను వదిలిన ఆగంతకులు
అమరావతి: లోక్ సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు అగంతకులు సభలోకి దూకి టియర్ గ్యాస్ ను వదిలారు..రాజ్యాంగాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు.. దీంతో వెంటనే ప్యానల్ స్పీకర్ సభను వాయిదా వేశారు.. ఏం జరుగుతుందొ ఆర్దంకాక ఎంపీలు భయంతో బయటకు పరుగులు తీశారు..ఇందులో ఓ ఆగంతకుడు స్పీకర్ వైపు ఛైర్ వైపు పరిగెత్తాడు..పోలీసులు వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.. 2001లో పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగింది..ఆ దాడి జరిగి 22 సంవత్సరాలు అవుతున్న సమయలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో అందరిలో తీవ్ర ఆందోళన నెలకొంది.. సభలో పార్లమెంట్ సభ్యులు కూర్చునే బల్లలపైకి ఎక్కి అన్ని చోట్లా తిరుగుతూ ఉన్న విజువల్స్ పార్లమెంట్ సీసీటీవీలో రికార్డ్ అయింది..జీరో హవర్ జరుగుతుండగా ఈ ఘటన జరగడంతో సభలోని సభ్యులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఆగంతకులు షూ నుంచి టియర్ గ్యాస్ వెలువడినట్లు పోలీసులు భావిస్తున్నారు.. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని స్పీకర్ ఓం బిర్లా ఆదేశించారు..ఈ ఘటనతో పార్లమెంట్ ఆవరణ మొత్తం పసుపు వర్ణంతో నిండిపోయింది.
#WATCH | Delhi: Two protestors, a man and a woman have been detained by Police in front of Transport Bhawan who were protesting with colour smoke. The incident took place outside the Parliament: Delhi Police pic.twitter.com/EZAdULMliz
— ANI (@ANI) December 13, 2023