మధురలోని ఆలయం ప్రక్కనే షాహీ ఈద్గాలో సర్వేపై సుప్రీం స్టే
అమరావతి: ఉత్తరప్రదేశ్ లో శ్రీకృష్ణుడు జన్మించిన మధురలోని ఆలయం ప్రక్కనే షాహీ ఈద్గా నిర్మించారని, శాస్త్రీయ సర్వే చేయాలని దాఖలు అయిన పిటిషన్లపై సుప్రీమ్ కోర్టు స్టే విధించింది.. లక్నోకు చెందిన అడ్వకేట్ రంజనా అగ్నిహోత్రి 2020లో సదరు కేసును దాఖలు చేశారు.. 13.37 ఎకరాల వివాదాస్పద స్థలంలో మసీదును నిర్మించినట్లు ఆరోపించారు.. అక్కడే కట్రా కేశవ్ దేవ్ ఆలయం ఉన్నదని,, ఈ స్థలంలోనే కృష్ణుడు జన్మించిన చెరశాల ఉన్నట్లు పిటీషన్ లో వాదించారు..మథుర జిల్లా కోర్టులో పై విషయంపై 9 పిటిషన్లు దాఖలయ్యాయి.. పిటిషన్లు చాలాకాలం నుంచి పెండింగ్ ఉన్నాయి.. దింతో మధుర జిల్లా కోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు పిటిషన్లు బదిలీ చేశారు..2023 డిసెంబర్ లో హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది..కోర్టు పర్యవేక్షణలో షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ,, సర్వే పర్యవేక్షణకు అడ్వొకేట్ కమిషనర్ ను నియమించడానికి పర్మిషన్ ఇచ్చింది..హైకోర్టు ఉత్తర్వులపై ముస్లిం సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.. పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా,,జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది.. సర్వే చేపట్టే ప్రక్రియ తక్షణమే నిలిపి వేయాలని స్పష్టంచేసింది..సర్వేకు సంబంధించి హిందూ సంఘాలకు నోటీసులు జారీ చేసింది..షాహీ ఈద్గాలో సర్వేకు సంబంధించి ఇకపై అలహాబాద్ హైకోర్టులోనే విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.