తెలంగాణలో మూడు కమిషనరేట్ లకు కొత్త పోలీసు కమిషనర్ లు
హైదాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం జంట నగరాల్లో లోని మూడు కమిషనరేట్ లకు కొత్త పోలీసు కమిషనర్లను నియమించింది..హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ (సీపీ)గా కొత్తకోట.శ్రీనివాస్ రెడ్డి,,రాచకొండ పోలీస్ కమిషనర్ గా జి.సుధీర్ బాబు,,సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా అవినాష్ మొహంతిలు నియమితులయ్యారు..అలాగే తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ గా సందీప్ శాండిల్యను నియమించారు..