HYDERABAD

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆంధ్రప్రభ దినపత్రిక కార్యాలయంపై ఈడీ దాడులు

హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని ఆంధ్రప్రభ దినపత్రిక కార్యాలయంలో,కంపెనీ ఎం.డీ ముత్తా గోపాలకృష్ణ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్​లోని కార్యాలయంతో పాటు గచ్చిబౌలిలో ఉన్న ఇంట్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.మద్యం కుంభకోణంలో పంజాబ్‌లోని AAP ప్రభుత్వం ఈ మీడియా హౌస్‌కి ₹ 20 కోట్లు బదిలీ చేసింది. లిక్కర్ స్కామ్​లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ రెడ్డి, ఆంధ్రప్రభలో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. ఆ ఛానల్ ముత్తా గోపాలకృష్ణకు చెందిన గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు గుర్తించారు.అభిషేక్ రెడ్డి,,సీఎం కేసీఆర్ కుమార్తెకు అత్యంత సన్నిహితుడని సమాచారం ?

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *