హైదరాబాద్: రియల్ స్టార్,నటుడు స్వర్గీయ శ్రీహరి,తమ్ముడు శ్రీధర్ ను సెంట్రల్ బోర్డు అఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (ప్రాంతీయ సెన్సార్ బోర్డు) హైదరాబాద్ రీజియన్ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. శ్రీహరి తమ్ముడైన శ్రీధర్ నటుడిగా వంద సినిమాల్లో పైగా నటించడంతో పాటు నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు. రెండు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. తనకు లభించిన ఈ పదవికి పూర్తి న్యాయం చేకూరుస్తానని శ్రీధర్ వెల్లడించారు. కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ కు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు, నిర్మాతలు నట్టి కుమార్, జేవీ మోహన్ గౌడ్ తదితరులు శ్రీధర్ కు శుభాకాంక్షలు తెలిపారు.