నరేంద్ర మోదీకి ఈజిప్ట్ దేశ అత్యున్నత పురస్కారం ప్రధానం
అమరావతి: ఈజిప్ట్ రాజధాని కైరోలో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి తమ దేశ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది నైల్ ప్రదానం చేశారు..అమెరికా పర్యటన ముగించుకున్న మోదీ శనివారం ఈజిప్ట్ వెళ్లిన విషయం విదితమే..ఈ సందర్భంగా ప్రధాని మోదీ,,ఈజిప్ట్ ప్రధాని మోస్తఫా మడ్బౌలీతో ధ్వైపాక్షిక చర్చలు జరిపారు..కైరోకి చేరుకున్న ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు..తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అతి పురాతన అల్-హకీమ్ మసీదును సందర్శించారు..ఈ మసీదు 11వ శతాబ్దం నాటిది.. దీన్ని 1979లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.. హెలియోపొలిస్ కామన్వెల్త్ వార్ గ్రేవ్ సిమెట్రీలో స్మారకాన్ని సందర్శించారు..రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్లకు నివాళులు అర్పించారు..ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా-ఈజిప్ట్ పర్యటన నేటితో ముగియనుంది.