పులివెందుల నుంచి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు-పవన్ కళ్యాణ్
అమరావతి: పులివెందుల నుంచి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు,, మనం పులివెందుల వెళ్లి, గోదావరి సంస్కారాన్ని జగన్ రెడ్డికి నేర్పుదా అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.అదివారం రాజోలు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో అయన మాట్లాడుతూ విజయం వెలుగులు రాజంపేట వరకు ప్రసరింపచేస్తామంటూ వ్యాఖ్యనించారు.. క్రిమినల్స్ రాజకీయాల్లో ఉంటే విలువలు పాటించే వారు లొంగిపోతారని అవేదన వ్యక్తం చేశారు.. వైసీపీ చేసేది కుల ప్రాతిపదిక రాజకీయాలు,, అలాంటి రాజకీయాల వల్లే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు.. ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం ఇవ్వకుండా గోదారి దాటి వెళ్లిపోయారంటూ ఎద్దేవా చేశారు.. ప్రజలు ప్రశ్నిస్తుంటే కేసులు పెడుతున్నారు ఇదే పద్దతని ప్రశ్నించారు..జనసేన తరపున గెలిచి ప్లేటు ఫిరాయించిన రాపాక లాంటి ఎమ్మేల్యేను రీకాల్ చేసే హక్కు ప్రజలకుండాలని అభిప్రాయపడ్డారు..