సత్నామ్ సింగ్ సంధును రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసిన రాష్ట్రపతి
అమరావతి: ప్రఖ్యాత విద్యావేత్త, సామాజిక సేవకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న, ఛండీఘడ్ యూనివర్శిటీ ఛాన్సలర్ సత్నామ్ సింగ్ సంధును రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నామినేట్ చేశారు..సత్నామ్ సింగ్ ను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్టుగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు..
ప్రధాని మోదీ:- సత్నామ్ సింగ్ ఎల్లప్పుడూ జాతీయ ఐక్యతను పెంపొందించారని,, ఎన్నారైలతో కలిసి పని చేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు..ఆయన రాజ్యసభకు నామినేట్ కావడం శుభపరిణామం అని,,అయనకు శుభాకాంక్షలు తెలిపారు..అలాగే రాజ్యసభ కార్యకలాపాలు ఆయన అభిప్రాయాలతో సుసంపన్నం అవుతాయని విశ్వసిస్తున్నానని ప్రదాని మోదీ పేర్కొన్నారు..