AMARAVATHI

రాష్ట్రంలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయి-పవన్ కల్యాణ్

అమరావతి: వైసీపీ పాలనలో రాష్ట్రంలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు..జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన పుష్ప విలాపం చదవకపోతే, జగదీశ్ చంద్రబోస్ మొక్కలపై చేసిన ప్రయోగాల గురించి ఏపీ సీఎం జగన్ అర్థం చేసుకోకపోతే ఏలాంటి నష్టం జరుగుతుందో తెయచేశారు..ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురం చెట్లను కొట్టేసిన ఫొటోలను ఈ సందర్భంగా పవన్ పోస్ట్ చేశారు..పుష్ప విలాపంలో జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన కవితను పోస్ట్ చేశారు..కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారని,, అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారని మండిపడ్డారు..తమిళనాట చెట్టును కుటుంబ సభ్యునిగా చూసుకుంటారని తెలిపారు..ఏపీలో ఆస్తులు కూడబెట్టుకొనే వాళ్లు ఈ విషయం కూడా తెలుసుకోవాలన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *